కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందారు. అనంతరం ఆయన అనుచరులు పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేశారని.. విపక్ష బీజేపీ నేతలు అసెంబ్లీలో ఆందోళన చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు.