ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా కీలక వ్యాఖ్యలు

78చూసినవారు
ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా కీలక వ్యాఖ్యలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచిందని అన్నారు. కచ్చితంగా పలానా పార్టీ గెలుస్తుందని కూడా చెప్పలేమని పేర్కొన్నారు. ప్రస్తుత అధికార వైసీపీ లేదా? ఎన్డీఏ కూటమి ఎవరు అధికారంలోకి వచ్చినా 95 నుంచి 97 సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం చాలా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్