పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలి: స‌జ్జ‌ల

73చూసినవారు
పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలి: స‌జ్జ‌ల
AP: ఈసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓట్ల లెక్కింపు సమయంలో వైసీపీ పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. "ప్రత్యర్థి పార్టీ పోలింగ్‌ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది." అని స‌జ్జ‌ల పేర్కొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్లకు నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌లో ఆయ‌న ఈ మేర‌కు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్