హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ముగ్గురు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను తప్పించారని ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ను సస్పెండ్ చేశారు.