కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల పోటీపై స్పష్టత వచ్చింది. ఆయన మరోసారి అమేథి నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇప్పటికే వయనాడ్ నుంచి పోటీ చేయనున్న రాహుల్ తాజాగా అమేథి నుంచి కూడా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కాగా గత లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి స్మృతి ఇరానీపై రాహుల్ ఓటమిపాలయ్యారు.