లోక్ సభలో శివుని ఫొటోను విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రదర్శించడంపై రగడ నెలకొంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. సభలో హిందూ భావన తెచ్చిన రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హింస భావనను ధర్మంతో జోడించడం సరికాదన్నారు. దేశం మొత్తాన్ని భయకంపితులు చేశారని, క్షమాపణలు చెప్పాకే రాహుల్ ప్రసంగం కొనసాగించాలని అమిత్ షా వ్యాఖ్యానించారు.