కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విరుచుకుపడ్డారు. పుల్వామా, ఉరీ దాడుల వెనక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని ఆ దేశ మాజీమంత్రి ఫవాద్ హుస్సేన్ గతంలో వెల్లడించారని, ఇప్పుడాయన రాహుల్ను ప్రశంసిస్తున్నారని చెప్పారు. శత్రువు మన్నన పొందిన ఆ నేతను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలా? అలాంటి వ్యక్తిని గౌరవించాలా? వారు దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు.