చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో ప్రజలకు తెలియాలని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును దుబాయ్లో దాచుకోవడానికి వెళ్లారా? అని అడిగారు. జూన్ 4వ తేదీన కూటమిని ప్రజలు సమాధి చేస్తారని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీస్సులతో గెలువబోతున్నామని జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీ జెండా ఎగరబోతోందని, శ్రేణులు సంబురాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.