కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ ఎన్నికలకు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో కలిసి నామినేషన్ వేశారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ లక్నోలోని దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.