రైతుల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోబోమని భారత్ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. భిన్నమైన సమస్యలపై వివిధ రైతు సంఘాలు తమ పంథాలో పోరాడుతాయన్నారు. రైతులు చేపట్టిన 'ఢిల్లీ ఛలో' సమస్యగా చిత్రీకరించొద్దని సూచించారు. తాము రైతులకు దూరంగా లేమని స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద రైతు సంఘం అయిన BKU రైతు ఉద్యమంలో చేరితే, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.