1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ హకర్.. రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్ హార్డికి పంపారు. ఉన్నత స్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్ను జిహెచ్ హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు.