రాములోరి కళ్యాణం.. తాళి కట్టుకుని తలంబ్రాలు పోసుకున్న హిజ్రాలు

71చూసినవారు
రాములోరి కళ్యాణం.. తాళి కట్టుకుని తలంబ్రాలు పోసుకున్న హిజ్రాలు
వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శ్రీ సీతరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. అయితే ప్రతి ఏడాదిలాగే కళ్యాణం జరుగుతున్నంత సేపు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హిజ్రాలు ఒకరికి ఒకరు తాళి కట్టుకుని తలంబ్రాలు పోసుకున్నారు. కల్యాణాన్ని దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు తిలకించారు. వేములవాడ పురవీధుల్లో సీతారాములకు ఘనంగా రథోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్