ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నమ్మే వారు దేశద్రోహులని అన్నారు. నోయిడా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎన్నికల కమిషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు.