తనకు దూరంగా ఉంటున్న కుమారుడిని గుర్తు చేసుకుని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు జొరావర్ పేరుతో ఉన్న జెర్సీని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. పంజాబ్ జెర్సీపై ‘1’ నంబర్ వేయించిన అతడు దాన్ని ధరించిన ఫొటో కూడా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా “మై బాయ్.. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు" అని రాసుకొచ్చాడు. ధావన్, తన భార్య అయేషా ముఖర్జీతో గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.