రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని సిపిఐ కాలనీలో ఉంటూ చేవెళ్ల చుట్టుపక్కల జరిగే జాతరలో బెలూన్స్ అమ్ముకునే మహమూద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇతనితోపాటు అదే కాలనీలో ముగ్గురు వ్యక్తులు కలిసి నివాసం ఉంటున్నాడు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.