వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

65చూసినవారు
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ కొడంగల్ పట్టణంలోని సోమవారం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టలో వేసి కంపోస్టు తయారు చేయడం పై వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఆంజనేయులు, భరత్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ నరేష్ రాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్