మట్టి కుప్పలు పడి బీహార్ వాసి మృతి

63చూసినవారు
మట్టి కుప్పలు పడి బీహార్ వాసి మృతి
కూకట్ పల్లి రంగనాయక స్వామి ఆలయ సమీపంలో హానర్ సంస్థ భవన నిర్మాణ పనులు జరుగుతున్నవి. ఆ పనులను బీహార్ కు చెందిన రవి(30) తన తండ్రి కిషోర్ రామ్ తో కలిసి చేస్తుండగా, కేబుల్ వైరింగ్ కోసం తీసిన గుంతలో వైర్ల సమస్య ఉండటంతో రవి గుంతలోకి దిగాడు. వైర్ మరమ్మత్తు పనులు చేస్తుండగా, ఒక్కసారిగా మట్టి కుప్పలు పడడంతో తోటి కార్మికులు అతడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా రవి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్