కర్మన్ ఘాట్ బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

78చూసినవారు
కర్మన్ ఘాట్ బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం
రంగరెడ్డి జిల్లాలోని కర్మన్ ఘాట్ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఈ నెల 10న విగ్రహా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం11న బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ ఎరుకల విశ్వనాధ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సదానంద్ రెడ్డి, రవి ముదిరాజ్, చీర తిరుమల్, మల్లేష్ గౌడ్, జగదీష్ గౌడ్, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్