తమకు న్యాయం చేయండి: రైతులు

75చూసినవారు
తమకు న్యాయం చేయండి: రైతులు
తుక్కుగూడ రావిర్యాలగ్రామ కొంగురు ఖద్దు-ఏ రెవెన్యూ వక్ఫ్ బోర్డు భూముల రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ డీకే అరుణను బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా రైతులు భూముల సమస్యపై ఆమెకు వినతి పత్రం అందజేశారు. సుమారు 600 ఎకరాల రైతుల భూములను వక్ఫ్ బోర్డు భూములుగా గత ప్రభుత్వాలు గెజిట్ ఇచ్చాయన్నారు. వక్ఫ్ బోర్డు పేరు తొలగించి తమకు న్యాయం చేయాలని ఎంపీని కోరామన్నారు.

సంబంధిత పోస్ట్