అభివృద్ధి పనులు తొందరగా పూర్తి చేయాలి: కార్పొరేటర్

65చూసినవారు
అభివృద్ధి పనులు తొందరగా పూర్తి చేయాలి: కార్పొరేటర్
కాలనీలలో మంజురైన అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని మైలార్ దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. బుధవారం డివిజన్ పరిధిలోని సాయిబాబానగర్, వడ్డెర బస్తీలలో అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ప్రజలు కార్పొరేటర్ కు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్