రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ డిపోలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ డిపోలో గల చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.