జీహెచ్ఎంసీ ఆస్తులను డిజిటలైజ్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్ అదనపు కమిషనర్ కోట శ్రీవాత్సవతో ఆమె బుధవారం సమీక్షించారు. వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలు, ఇతర ఆస్తులు ఎన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి రికార్డులు ఉన్నాయా? అద్దెలు సక్రమంగా వసూలవుతున్నాయా.? అని అడిగి తెలుసుకున్నారు.