శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. నారాయణపేట జిల్లాకు చెందిన అనిత తన తండ్రి వెంకటేష్ తో కలిసి మియాపూర్ లోని గోపాల్ నగర్ లో ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు అనిత అనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.