టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చంద్రబాబు ఏనాడు చేయలేదని విమర్శించారు. ఈ నెల ఒకటో తేదీన పింఛను రాలేదంటే అందుకు కారణం చంద్రబాబే అని ఆరోపించారు. "చంద్రబాబు.. ఏనాడైనా ప్రజలకు ఒక ఇల్లు ఇచ్చారా? సెంటు జాగా ఇచ్చారా? మీకెందుకు ఓటెయ్యాలి." అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండి.. కానీ ఓటు వేయకండని ఓటర్లను కోరారు.