కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన వారణాసి ఆంజనేయులు షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని చటాన్ పల్లి రైల్వే పట్టాలపై మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కేశపేట మండలం ఆవాజ్ మియా పడకల్ గ్రామానికి చెందిన ఆంజనేయులు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవపడి మనస్తవానికి గురై తిరుపతి నుంచి కాచిగూడ కు వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.