నాటుసారా పట్టివేత.. కేసు నమోదు

62చూసినవారు
నాటుసారా పట్టివేత.. కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద నాటు సారా అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఆమనగల్లు ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రామావత్ సోనా, ఇస్లావత్ దోలి అనే ఇద్దరు మహిళలు నాటు సారా అమ్ముతుండగా పోలీసులకు పట్టుపడ్డారు. మొత్తం 13లీటర్ల సారా, వాహనాలను సీజ్ చేసి 3కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్