ప్రేమజంటను వేధించిన వ్యవహారంలో ఉప్పల్‌ సీఐపై వేటు

1565చూసినవారు
ప్రేమజంటను వేధించిన వ్యవహారంలో ఉప్పల్‌ సీఐపై వేటు
ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఓ ప్రేమజంట ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసుశాఖ చర్యలు తీసుకుంది. బ్లాక్ మెయిలర్స్ తమను బెదిరించి రూ.3లక్షలు వసూలు చేశారని ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారికి న్యాయం చేయాల్సిన ఎస్సై శంకర్ పోకిరిలకు మద్దతుగా నిలిచి న్యాయం చేయలేదు. ఈ విషయం తెలిసిన రాచకొండ సీపీ తరుణ్ జోషి సీఐ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్