అదానీ పవర్ లిమిటెడ్కు చెందిన మధ్యప్రదేశ్లోని మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్లో రిలయన్స్ 5 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. 500 మెగావాట్ల విద్యుత్తును తమ సొంత అవసరాలకు (క్యాప్టివ్) వినియోగించుకోనుంది. ఈ విషయాన్ని ఇరు సంస్థలూ వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో పేర్కొన్నాయి. 20 ఏళ్లకు రిలయన్స్ తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదురినట్లు అదానీ పవర్ తన ఫైలింగ్ లో పేర్కొంది.