తెలంగాణలో నాలుగేళ్లకు పైగా డిప్యూటేషన్పై పని చేసిన ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజు ఆ రాష్ట్రం నుంచి రిలీవ్ అయ్యారు. శుక్రవారం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్రెడ్డిని కలిసి రిపోర్టు చేశారు. తెలంగాణలో రహదారులు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా శ్రీనివాసరాజు సుదీర్ఘకాలం పనిచేశారు.