‘రెమాల్’ తుపాను 16 మందిని బలి తీసుకుంది. సోమవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత పెను విధ్వంసాన్ని సృష్టించింది. భారీ వర్షం, ఈదురుగాలులతో బెంగాల్, బంగ్లాదేశ్లోని తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పలు ప్రమాద ఘటనల్లో మొత్తం 16 మంది చనిపోయారు. వీరిలో 10 మంది బంగ్లాదేశ్ ప్రజలు కాగా, ఆరుగురు బెంగాల్ వాస్తవ్యులు.