‘రెమాల్’.. బంగ్లా, బెంగాల్‌లో 16 మంది మృతి

55చూసినవారు
‘రెమాల్’.. బంగ్లా, బెంగాల్‌లో 16 మంది మృతి
‘రెమాల్’ తుపాను 16 మందిని బలి తీసుకుంది. సోమవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత పెను విధ్వంసాన్ని సృష్టించింది. భారీ వర్షం, ఈదురుగాలులతో బెంగాల్, బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పలు ప్రమాద ఘటనల్లో మొత్తం 16 మంది చనిపోయారు. వీరిలో 10 మంది బంగ్లాదేశ్ ప్రజలు కాగా, ఆరుగురు బెంగాల్ వాస్తవ్యులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్