సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని.. ప్రజాసేవకు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి
కేటీఆర్ అన్నారు. గ్రామ సర్పంచ్లుగా పదవీ విరమణ చేస్తున్న వారికి ఆయన 'ఎక్స్' వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో.. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశించారు.