ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డినే సీఎంగా కొనసాగుతారని.. ఆయనను డిస్ట్రబ్ చేయాలని పార్టీలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే BJP, BRS చెరో వైపు నుంచి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఆర్, బీ, యూ టాక్స్ వసూలు జరుగుతోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.