AP: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఎన్నికల సంఘం సీరియస్గా ఉందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. త్వరలోనే ఆయనను అరెస్టు చేసి తీరుతామని చెప్పారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యకర్తల్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు ఇప్పుడు మాచర్ల వెళ్లటం మంచిది కాదన్నారు.