బైకర్‌ను వెంబడించి దాడి చేసిన ఖడ్గమృగం.. షాకింగ్‌ వీడియో

51చూసినవారు
అస్సాంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. మోరిగావ్‌ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఆదివారం ఓ బైకర్‌పై ఖడ్గమృగం దాడి చేసింది. ఈ ఘటనలో కమ్రూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాకు చెందిన 37 ఏళ్ల సద్దాం హుస్సేన్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఖడ్గమృగం బయటకు వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్