కార్గిల్ యుద్ధంలో 'రైఫిల్మ్యాన్ సంజయ్ కుమార్' ఏరియా ఫ్లాట్ టాప్ 4875 ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒంటరిగా పాక్ బంకరు వైపు కొండపైకి పాకుతూ వెళ్ళి శత్రువుపై బులెట్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సంజయ్ ఛాతీలో, ముంజేయిలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లినా కూడా ఆయన ధైర్యంగా చేతులతో పోరాడి ముగ్గురు శత్రు సైనికులను చంపాడు. తరువాత శత్రువు మెషిన్ గన్ని తీసుకొని రెండవ శత్రు బంకర్ వైపు దూసుకువెళ్లి శత్రుసైన్యాన్ని అంతమొందించాడు.