అక్రమాలకు అడ్డాలుగా మారిన ఆర్టీఓ ఆఫీసులపై తెలంగాణ ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్పేట్, ఖైరతాబాద్, అత్తాపూర్లల్లో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నేరుగా వాహనదారుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న అధికారులు.. ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.