బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం జపాన్లో షూటింగ్ను జరుపుకుంటోంది. తాజాగా షూట్ పూర్తి కావడంతో టీమ్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ సందర్బంగా పబ్లో సాయి పల్లవి మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.