హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్లపై వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. అయితే ఇలాంటి చర్యలను తాము ఏమాత్రం సహించమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ఘటనపై మహేశ్వరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన ట్వీట్ చేశారు.