ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేశాయని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి. TGSPDCL, APEPDCL మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కమ్లదీ అదే పరిస్థితి. TGNPDCL, APSPDCL, APCPDCL పరిధిలోని బిల్లులు చెల్లించాలని ప్రయత్నించినప్పుడు భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్కు రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది.