దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,123 వద్దకు చేరింది. సెన్సెక్స్ 34 పాయింట్లు దిగజారి 79,441 వద్ద ముగిసింది. ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, TCS, HCL టెక్నాలజీస్, టాటా స్టీల్, NTPC కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా నష్టపోయాయి.