మైనారిటీ విద్యార్థులకు సువర్ణావకాశం
కోహిర్ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశం పొందేందుకు నోటిఫికేషన్ విడుదలైందని మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అలియా ఫరిదా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఐదవ తరగతిలో 40 సీట్లకు 30 మైనారిటీ విద్యార్థినులకు, 10 ఇతర విద్యార్థినులకు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.