నేటి నుండి ఒంటి పూట బడులు

637చూసినవారు
నేటి నుండి ఒంటి పూట బడులు
ఎండ తీవ్రతను బట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడి కేంద్రాలలో ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నామని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సుజాత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడి కేంద్రాలు పని చేస్తాయన్నారు.

అంగన్వాడి కేంద్రం నుంచి లబ్ధిదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆయా సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ, ఆయలు, టీచర్లు, సమయ భావన పాటిస్తూ అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్