రెండో విడత కంటి వెలుగు ప్రారంభం

263చూసినవారు
రెండో విడత కంటి వెలుగు ప్రారంభం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంలోని డోర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఎంపీడీవో షాజీలుద్దీన్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కంటి సమస్య ఉన్న 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ జయశ్రీ మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పుష్ప మోహన్రావు, గ్రామ సర్పంచ్ ఇట్టే నరసమ్మ, వివిధ శాఖ అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు విజయవంతం చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్