చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఐనోల్ గ్రామానికి చెందిన శ్రీను, మహేష్ అనే ఇద్దరు యువకులు శనివారం స్థానిక తేటకుంటలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.