జిన్నారం మండలంలోని ఆయా గ్రామాలలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో కోతుల గుంపులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో భయాందోళనకు గురి చేస్తూ దాడి చేస్తున్నాయి. కోతులను అరికట్టడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి కోతుల బెడదను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.