వైభవంగా వీరభద్రుడి రథోత్సవం

1069చూసినవారు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం తెల్లవారుజామున స్వామివారి దివ్య మంగళ రథోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అశేష భక్తజనం సమక్షంలో వీరభద్రుడి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగులో జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్