రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం RBI కొత్తగా ఓ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో రిటైల్ డైరెక్ట్ పోర్టల్కు సంబంధించిన మొబైల్ యాప్ను తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.