కంది మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉన్నా రికార్డులను, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ. మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు.