సంగారెడ్డి జిల్లాలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు 30, 30(ఎ) యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ రూపేష్ మంగళవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, పబ్లిక్ సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.