పెరిగిన ఎండ తీవ్రత

73చూసినవారు
పెరిగిన ఎండ తీవ్రత
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎండలు ముదురుతున్నాయి. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోత మొదలైంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదైంది. మార్చి మొదట్లోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతతో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్